రంగారెడ్డి జిల్లా అధ్యక్షుని ఎమ్మెల్యే ను కలిసిన మాజీ అధ్యక్షుడు వీరేశం కుమార్

Published: Monday January 31, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి : టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నియమించిన సందర్భంగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాసా పార్టీ మాజీ మండల అధ్యక్షులు బోస్ పల్లి విరేష్ కుమార్ మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కృషి చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మడుపు వెంకటేష్, నరకుడి నరసింహ, బుట్టి మహేందర్ కొంగరి శ్రీకాంత్, నలోల్ల శేఖర్ పాల్గొనడం జరిగింది