రిషివర్ష మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి..
Published: Wednesday December 14, 2022
పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ కాపా మురళీకృష్ణ..
వైరా, డిసెంబర్ 13 (ప్రజాపాలన న్యూస్):
రిసీవర్ష మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్త్రిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఆకాంక్షించారు. మంగళవారం లయన్ పెనుగొండ ఉపేందర్ రావు, సరిత దంపతుల కుమారుడు రిషివర్ష పుట్టినరోజు వేడుకలు శాంతినగర్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపా మురళీకృష్ణ చేతుల మీదుగా 20 మంది చిన్నారులకు పుస్తకాలు, దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రాయపూడి వెంకటేష్, డాక్టర్ పెరుమాళ్ల కృష్ణమూర్తి, నూకల ప్రసాద్ రావు, గజ్జల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: