ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్

Published: Wednesday June 09, 2021

జిన్నారం, జూన్ 8, ప్రజాపాలన ప్రతినిధి : మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం పూర్తిగా ఇటీవల కురిసిన వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని మంగళవారం స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఐకెపి సిబ్బంది సోమవారం దాన్యం లారీలు రాక తడిసి పోయిందని తెలపడంతో మంగళవారం ఎంపీపీ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని లారీలను అందుబాటులో ఉంచాలని రైస్ మిల్ యజమానులకు సూచించడంతో మంగళవారం ధాన్యం లారీల లో తరలించడానికి ఏర్పాటు చేశారు దీంతో ఇంకేమైనా ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు చూడాలని కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తుందని ప్రగల్భాలు పలకడం వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు మండల కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం మొలకలెత్తి పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆయన విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి గింజను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. జిన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గత కొన్ని రోజులుగా లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తలు అక్కడే నిల్వ ఉన్నాయి  మొన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో ఐకేపి వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య యనగండ్ల నరేందర్  సత్యనారాయణ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు