మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించిన యాదవ సంఘం నాయకులు గంగుల పుల్లయ్య పూజా కార్

Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయం నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోనకల్ ఎస్సై తేజావత్ కవిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో గోపూజ నిర్వహించి మహిళలు ఎస్ఐ కవితకు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ఉపాధ్యక్షులు గంగుల నాగేశ్వరావు, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, ఎంపీటీసీ గుగులోతు రమేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు, ఏఎస్ఐ నాగరాజు, గ్రామ మహిళలు, యాదవ సంఘం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
Attachments area