మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించిన యాదవ సంఘం నాయకులు గంగుల పుల్లయ్య పూజా కార్
Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయం నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోనకల్ ఎస్సై తేజావత్ కవిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో గోపూజ నిర్వహించి మహిళలు ఎస్ఐ కవితకు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం ఉపాధ్యక్షులు గంగుల నాగేశ్వరావు, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, ఎంపీటీసీ గుగులోతు రమేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నాగేశ్వరావు, ఏఎస్ఐ నాగరాజు, గ్రామ మహిళలు, యాదవ సంఘం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: