గద్దె మల్లేశ్వర కుటుంబానికి 70,000/రూ ఆర్థిక సహాయం అందజేత
Published: Wednesday February 02, 2022
అందజేసిన బోనకల్ యాదవ సంఘం నాయకులు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు
బోనకల్ ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుడు గద్దె మల్లేశ్వరరావు (35) గత 5 నెలల క్రితం అకాల మరణం చెందగా వారి కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో ఆ కుటుంబానికి బోనకల్ భవన నిర్మాణ కార్మికులు మరియు యాదవ సంఘం నాయకులు సమిష్టిగా ఏర్పడి వారి కుటుంబానికి 70,000/రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మరియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ వీరి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా మేము అండగా ఉంటామంటూ వారు తెలిపినారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, బోనకల్ సహకార సంఘం డైరెక్టర్ గంగుల పుల్లయ్య, యాదవ సంఘం నాయకులు బోనకల్ మాజీ ఎంపీటీసీ గంగుల శ్రీనివాసరావు, యాదవ సంఘం నాయకులు బీజేపీ గ్రామ అధ్యక్షులు గంగుల నాగయ్య, యాదవ సంఘం నాయకులు గంగుల కోటేశ్వరరావు, సీఐటీయూ బోనకల్ మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు షేక్ ఖాదర్ బాబా (బుజ్జి), భవన నిర్మాణ కార్మికులు గుంటి శ్రీను, గద్దల శ్రీను, షేక్ మీరా, గోవర్ధన్, వార్డ్ మెంబర్ ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: