స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా ఎదగాలి ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ **

Published: Thursday October 20, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 19 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదగాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం లోని రౌటసంకేపల్లి గ్రామములో మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దీనిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఎదగాలన్నారు. ఆర్థిక చేయూత సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం పర్సనంబాల పాఠశాలలో బిపివి ని పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎంపీవో ప్రసాద్, ఏపీవో చంద్రశేఖర్,సర్పంచి విమల కిష్టయ్య, వైస్ ఎంపీపీ పెంటయ్య, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area