జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తా

Published: Tuesday March 23, 2021
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, మార్చి22 (ప్రజాపాలన ప్రతినిధి) : జర్నలిస్టుల సంక్షేమ, అభివృద్ధికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన కమిటీ అధ్యక్షులు దొంతుల వెంకట్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూ కుట్ల నరోత్తం రెడ్డి మరియు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ  వర్కింగ్ ప్రెసిడెంట్  వేముల తిరుపతి రెడ్డి , ఉపాధ్యక్షులు ఎం. సురేష్, ఏవి.శ్రీధర్ రావు, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, సహాయ కార్యదర్శులు జి. శివాజీ, గుత్తి శేఖర్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజు, సలహాదారులు  కొలనుపాక చంద్రమౌళి, పల్లా మహేందర్ రెడ్డి, మరియు జర్నలిస్టులు శ్రీశైలం, కిషోర్ పాల్గొన్నారు.