ధారూర్ నుండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు పాద యాత్ర
Published: Wednesday June 30, 2021
వికారాబాద్, జూన్ 29, ప్రజాపాలన బ్యూరో : మల్కాజిగిరి ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షునిగా నియమించిన సందర్భంగా అనంత పద్మనాభ స్వామికి మొక్కిన మొక్కును చెల్లించుకుంటానని ధారూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పట్లోళ్ళ రఘువీరా రెడ్డి అన్నారు. మంగళవారం ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ వేడుక వేదికలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రథసారథిగా నియమింపబడితే ధారూర్ నుండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేపడుతానని పేర్కొన్నారు. జూలై 6వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నామని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నూతన టిపిసిసి అధ్యక్షునికి మద్దతుగా పాదయాత్ర నిర్వహించి శుభాభివందనాలు తెలుపుతామని చెప్పారు.
Share this on your social network: