మద్యం షాపులో లిక్కర్ చోరీ

Published: Thursday November 24, 2022
కాస్ట్లీ బాటిల్స్ ను ఎత్తుకెళ్లిన దొంగ
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన :  మద్యం షాపులో లిక్కర్ చోరీ జరిగిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మద్యం షాప్ యజమాని కృపాకర్ గౌడ్ వికారాబాద్ పట్టణ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల బాలాజీ వైన్స్ లో ఖరీదైన లిక్కర్ బాటిల్స్ ను ఎత్తుకెళ్ళాడు ఓ దొంగ. దొంగిలింపబడిన లిక్కర్ ధర సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. గ్రిల్ విరగ్గొట్టి లోపలికి చొరబడి 50 వేల రూపాయలు నగదు ఖరీదైన లిక్కర్ బాటిల్స్ ను ఎత్తుకెళ్ళాడు దొంగ. సీసీ కెమెరా డివిఆర్ ను కూడా ఎత్తుకెళ్లిన దొంగ. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.