వరద బాధితులకు ఆర్థిక సహాయం

Published: Monday July 18, 2022
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ
 
మంచిర్యాల టౌన్, జూలై 17, ప్రజాపాలన : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆర్థిక సహాయం, శనివారం మంచిర్యాల పట్టణం లోని ఎల్.లి.సి కాలనీ, పద్మశాలి కాలనీ కి చెందిన కౌసల్య, గుమ్ముల శైలజ లకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరుపున  ఇరువురికి  2500 రూపాయలు, 25 కిలోల బియ్యం,నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరద బాధితుల కు అండగా ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, కోశాధికారి పడల రవీందర్, మేనేజ్మెంట్ కమిటి సభ్యులు కాసర్ల శ్రీనివాస్, సత్యపల్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జీవిత కలా సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు