ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు

Published: Monday September 19, 2022

 

 ప్రజా పాలన ప్రతినిధి.   హైదారాబాద్  సెప్టెంబర్ 18 

చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి జన్మదినాన్ని జూబ్లీహిల్స్ వారి నివాసం వద్ద అభిమానులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకుల మధ్య అంగరంగ వైభవంగా కోలాహలంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలనుండి అభిమానులు శాలువాలతో సన్మానించి పూల బోకెలను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద పెద్ద గజమాలలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పథకాలతో ప్రజలు అభినందించి ఈ రోజు నన్ను గౌరవించడం జరిగిందన్నారు. అంతే కాకుండా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అభిమానులు మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ ఏర్పాటు చేసిన విందులో  అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆరగించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, అభిమాన శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ప్రజా పాలన ప్రతినిధి.   హైదారాబాద్  సెప్టెంబర్ 18