రాహుల్ జూడో పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ సంఘీభావం మధిర సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సి
దేశ ఐక్యత కోసం సార్వభౌమత్వా నికి కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రతో దేశ రాజకీయాలు మారనున్నాయని జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ సీఎల్పీ లీడర్ మల్లు విక్రమార్క సతీమణి మల్లు నందిని పేర్కొన్నారు. పేదలందరికీ న్యాయం జరగాలని, కుల మత వర్గ భేదాలకు తావు లేకుండా దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి చేపట్టిన జోడో పాదయాత్రకు సంఘీభావంగా మధిర ఎర్రుపాలెం మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి బండారి నరసింహారావు పట్టణ అధ్యక్షులు మిర్యాల రమణగుప్త ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు చేపట్టిన పాదయాత్రను ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బుచ్చిరావు వంశీ అప్పారావు కర్నాటిరామారావు వెంకటేష్ రెడ్డి వాసు అద్దంకి రవి ప్రసాద్ కృష్ణారావు దారా బాలరాజు పిచ్చయ్య బాలు నాయక్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Share this on your social network: