తల్లాడలో అయ్యప్ప స్వాముల మహా పడిపూజ

Published: Monday November 21, 2022
తల్లాడ, నవంబర్ 20 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడలోని గౌడ బజార్లో శనివారం రాత్రి అయ్యప్ప స్వాముల మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. పూజారి మణికంఠ శర్మ పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సంకీర్తనాలతో ఆ ప్రాంతమంత మార్మోగింది.  ఈ కార్యక్రమంలో  మొక్కా ఉపేంద్ర, శ్రీదేవి దంపతులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈలప్రోలు వెంకట్ బృందంచే ప్రత్యేక గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎర్రి నరసింహారావు, కొమ్మినేని రామయ్య, విజయ రెడ్డి,  నాగులు,  తదితరులు పాల్గొన్నారు.