మురిమడుగు జిపిలో మూడవ వార్డుకు ఉప ఎన్నిక

Published: Wednesday April 13, 2022
జన్నారం రూరల్, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామ పంచాయతీ మూడవ వార్డుకు ఉప ఎన్నిక జరుగుతుందని స్థానిక ఎంపిడిఒ అరుణారాణి తెలిపారు. మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామ పంచాయతిలోని 3వ వార్డుకు ఆకస్మిక సాధారణ ఉప ఎన్నికలు జరుపుటకుగాను డ్రాఫ్ట్ ఓటర్ల జాబితపై తేదీ 13/04/2022 రోజున మధ్యాహ్నం 12.00 గంటలకు మండల ప్రజా పరిషత్ కార్యాలయము జన్నారం నందు వివిద పార్టీల మండల అధ్యక్షులకు సమస్త జన్నారం మండల కేంద్రంలో సమావేశం వుంటుందని సకాలములో హాజరుకాగలరని అమె కోరారు,