వరద బాధిత గ్రామాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన

Published: Wednesday August 03, 2022

జగిత్యాల, ఆగస్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం గ్రామాలల్లో వరదలతో దెబ్బతిన్న లిఫ్ట్ లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్, డిసిఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ అరుణ, ఎంపీపీ చిట్టీ బాబు, ఏఎంసి ఛైర్మెన్ రాజేష్, రైతు బంధు సమితి నాయకుడు సౌల్ల భీమయ్య, మండల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.