కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
Published: Friday April 01, 2022
ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మార్చి 31 : వికారాబాద్ జిల్లా కొడ౦గల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎండీ.యూసుఫ్, నయీ౦, ఆనంద్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కౌన్సిలర్ శంకర్నాయక్, ఆసిఫ్ ఖాన్, అంబయ్య గౌడ్, దత్తు, రాము, రమేశ్, రాజునాయక్, తార్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: