నూతన "సూపర్ లగ్జరీ" బస్ ప్రారంభోత్సవం ** జెడ్పి చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే

Published: Friday January 06, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 5 (ప్రజాపాలన,ప్రతినిధి) : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ బస్ డిపోలో కు మంజురైనా నూతన "సూపర్ లగ్జరీ బస్" ను జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బిఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ ల జిల్లా ఫోరమ్ అధ్యక్షులు శ్రీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్, లు నూతన బస్సును ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బస్ లో ముఖ్య అతిధులు కూర్చొని జిల్లా కేంద్రం లో ప్రయాణం చేసారు. ప్రజా రవాణా చైతన్య రథం ఆర్టీసీ కళాకారులచే కలిసి, వారు నిర్వహించిన ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ ఏ. శ్రీధర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఎక్స్ ఎంపీపీ బాలేష్ గౌడ్, ఎక్స్ ఎంపీటీసీ మంగ,లాలూ, ఎస్సీ ఎస్టీ జిల్లా కమిటీ మెంబర్ గోపాల్ నాయక్, మైనారిటీ నాయకులు అమర్ బిన్ అహ్మద్,నిసార్,అహ్మద్,ఎంఎఫ్ మధుసూదన్, అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్ సూపరిండెంట్ శ్రీనివాస్,సూపర్ వైసర్ ఉదయ్,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.