ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Published: Wednesday January 04, 2023
ఇబ్రహీంపట్నం, జనవరి 03(ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని ప్రతి గ్రామంలో
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ష కొండ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్త్రీ,పురుషులు కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడం సహజమైన హక్కు గా ఉంటుందని, అందుకే అందరూ చదవాలి అందరు సమానంగా బ్రతకాలి అని అను నిత్యం తపించిన సామాజిక విప్లవకారిని సావిత్రిబాయి పూలే అని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ పొనకంటి చిన్న వెంకట్, ఉప సర్పంచ్ మంగిలిపెళ్లి లక్ష్మణ్, బి ఆర్ఎస్ నాయకులు దొంతుల తుకారాం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు తాండ్ర విజయ్, బొబ్బిలి కిషోర్, బీఎస్పీ నాయకులు గుజ్జరి ప్రకాష్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: