టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలి : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Thursday October 28, 2021
మేడిపల్లి, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని శాలువాతో సన్మానించిన రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎండి ముస్తాక్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి, తాడూరి శ్రీనివాస్, కార్పోరేటర్లు బొంతు శ్రీదేవి యదవ్, స్వర్ణరాజ్, ప్రభుదాస్, దేవేందర్ రెడ్డి, శాంతిసాయి జెన్ శేఖర్, మాజీ కార్పోరేటర్లు గంధం జోస్నా నాగేశ్వరావు, నాయకులు రేపాక కుమారస్వామి, భాగ్యరేఖ, సంధ్యారాణి, సంపత్  వివిధ డివిజన్ల అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు, కార్యకర్తలు, మహిళ నాయకులు పాల్గోన్నారు.