ఎక్సైజ్ అధికారులకు బెల్ట్ షాపులపై పిర్యాదు

Published: Tuesday July 20, 2021
జిన్నారం మండలం బొల్లారం మున్సిపాటిల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారని సోమవారం రోజు ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డికి విన్నతి పత్రం అందచేసిన బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి. బొల్లారంలో ప్రస్తుతం నడిపిస్తున్న బెల్ట్ షాపులకి వైన్ షాపుల యాజమాన్యలే సహకరిస్తున్నాయి. అయితే గతంలో చాలా సార్లు బెల్ట్ షాపులపై పిర్యాదు చేశానని, కానీ ఎక్సైజ్ అధికారులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసి వెళ్తున్న కానీ వాళ్ళు మళ్ళీ యధావిధిగా బెల్ట్ షాపులను నడిపిస్తున్నారని మరియు ముఖ్యంగా ఐడిఎ బొల్లారం చౌరస్థలో వైన్స్ అండదండలతో ఒక చిన్న వైన్ షాపుల బహిరంగగా మద్యం అమ్ముతున్నారని ఇదే కాకుండా వైస్సార్ కాలనీ, బీసీ కాలనీల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు అని కావున బెల్ట్ షాపులపై మరియు వీళ్లకు సహకరిస్తున్న వైన్స్ షాపులపై తక్షణమే చెర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టీ.రవీందర్ రెడ్డి ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డిని కోరడం జరిగింది.