కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 65 వర్ధంతి వేడుకలు

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : మధిర కాంగ్రెస్ పార్టీకేశవ భవన్ కార్యాలయం నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మరియు మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిరియాల వెకటరమణ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అనిఆయన రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో ఈ రోజు ప్రభుత్వాలు గాని న్యాయవ్యవస్థ గాని నడుస్తున్నాయని, సంఘ సంస్కరణ కర్త అని, అంటరానితనాన్ని కుల నిర్మూలన కోసం కృషి చేశారని. ఇతని విశిష్ట సేవలకు భారత ప్రభుత్వం 1990లో భారత రత్న అవార్డు ప్రకటించారని. 2012 సంవత్సరంలో గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో మొదటి స్థానంలో ఎంపికయ్యారు. అంబేద్కర్ స్ఫూర్తినీ ఆదర్శంగా తీసుకొని ప్రజలంతా ముందుకు నడవాలని వారన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు దారా బాలరాజు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్ పట్టణ బిసి సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య మాజీసర్పంచ్ కర్నాటి రామారావు సేవాదళ్ మండల అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మండల కాంగ్రెస్ నాయకులు సంపశాల రామకృష్ణ ఆదిమూలం శ్రీనివాస్ కోట డేవిడ్ మల్ల ప్రదీప్ తిరువీధుల రామకృష్ణ మైలవరపు చక్రి తదితరులు పాల్గొని నివాళులర్పించారు