రసవత్తరంగా మారనున్నా మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు
Published: Wednesday March 17, 2021
మధిర, మార్చి16 ప్రజాపాలన ప్రతినిధి : పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేస్తున్న మధిర న్యాయవాదులు మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలు. ఈనెల 26న జరగనున్న బార్ ఎన్నికల్లో అధ్యక్ష పదవి పోటీలో సీనియర్ న్యాయవాదులు కావూరి రమేష్, భైరవభట్ల శ్రీనివాసరావు, చావలి రామరాజు, బోజడ్ల పుల్లారావు పోటీలో ఉన్నట్లు సమాచారం ఇప్పటికే కావూరి రమేష్, భైరవభట్ల శ్రీనివాసరావు అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. సెక్రటరీ పదవికి మహిళా న్యాయవాది అవ్వా. విజయలక్ష్మి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. రేపు చావలి రామరాజు బోజడ్ల పుల్లారావు అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మధిర బార్ అసోసియేషన్ఎ న్నికలు రసవత్తరంగా జరగనున్నట్లు తెలుస్తుంది.
Share this on your social network: