గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు నాయకులు

Published: Monday September 20, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పివిలేజ్ ఎస్టేట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కుర్రి మహేష్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి బోడుప్పల్ కార్పొరేటర్లు బింగి జంగయ్య యాదవ్, కొత్త చందర్ గౌడ్, చీరాల నర్సింహా, కోఆప్షన్ సభ్యులు రంగ బ్రాహ్మన్న గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ముఖ్య అతిధులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుందర్, చంద్రమౌళి, ప్రశాంత్ పాల్గొన్నారు.