36వ డివిజన్ లో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Published: Tuesday September 28, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : దశలవారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు. మీర్ పేట్ నగరపాలక సంస్థ లో 38వ డివిజన్ కార్పొరేటర్  పద్మ నరసింహ యాదవ్ తో కలిసి ముఖ్య అతిథులు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ డ్రైనేజ్ అభివృద్ధి కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... దశల వారీగా ప్రతి కాలనీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అభివృద్ధికి ఎల్లవేళలా ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్ రామ్ చందర్, టిఆర్ఎస్ నాయకులు బండి నాగేష్, టీ.నరసింహారెడ్డి, బిజెపి కార్యకర్తలు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.