వికారాబాద్ రైల్వే బ్రిడ్జి మరమ్మతులు త్వరలో ప్రారంభం

Published: Tuesday November 15, 2022
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : వికారాబాద్ రైల్వే బ్రిడ్జి మరమ్మతులు త్వరలో ప్రారంభించుటకు డేనియల్ తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్ పట్టణ కేంద్రంలోని రైల్వే బ్రిడ్జిని స్ట్రేటనింగ్ చేసే విషయమై సోమవారం బిషప్ ఎం ఏ  డేనియల్ నివాసంలో  ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి లు చర్చలు జరుపగా అందుకు బిషప్ సానుకూలంగా స్పందించారు.