శ్రీనిధి మ్యూచువల్లీ కో ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్

Published: Tuesday August 30, 2022
ప్రజాపాలన. ఆగస్టు 29. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల్ .
శ్రీనిధి బ్రాంచ్  లో పొదుపు చేస్తున్నటువంటి ముకురాల గ్రామానికి చెందిన బండ మల్లమ్మ గారు అనారోగ్య కారణంగా మృతి చెందారు.
వారి యొక్క నామిని అయినటువంటి కూతురు పార్వతమ్మ గారికి  కల్వకుర్తి బ్రాంచ్ యొక్క ఇన్చార్జి హిమబిందు సాగరిక, అడ్వైజర్ బి.పుష్పలత గారు, మార్కెటింగ్ ఆఫీసర్ మట్ట నగేష్, కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఐనోలు రాజు గార్ల, మరియు గ్రామ పెద్దల సమక్షంలో సంస్థ నుండి ఇచ్చే సాధారణ భీమా 10,000/- లు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ యొక్క ఇన్చార్జి హిమబిందు సాగరిక గారు మాట్లాడుతూ పొదుపు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పొదుపు చేసుకోవాలని సూచించారు.