కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Saturday June 26, 2021
జిన్నారం, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్ దానని భాస్కర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు కాలికి తీవ్ర గాయం కావడంతో హాస్పిటల్ లో చేర్చిన అనంతరం ఆపరేషన్ తప్పనిసరి కావడంతో టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్, సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంత్రివర్యులు కేటీఆర్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సమాచారం అందజేశారు. వారు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు, కాలికి ఆపరేషన్ అయ్యాక ఇటీవల బాధితుడు భాస్కర్ ఇంటికి చేరుకున్నారు ఈ విషయం తెలుసుకొని స్వయంగా బాధితుడు భాస్కర్ ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటాం అని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు బాధితుడు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారితో పాటు జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ, సర్పంచుల ఫారం మండల అధ్యక్షుడు శివరాజ్, నల్తూరు సర్పంచ్ జనార్ధన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్, ప్రభాకర్ రెడ్డి, స్థానిక వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్, కొరబోయిన మంజుల యాదయ్య, శ్రీనివాస్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి నాయకులు బ్రహ్మేందర్ గౌడ్, నర్సింహ రెడ్డి, మోహన్, గోపి గౌడ్, చిటుకల వెంకటేష్, కృష్ణ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, మున్నీ నర్సింగ్ రావు, జిన్నారం రాము, చిన్న శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, యాదగిరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.