చర్చ్ ఆలయ నిర్మాణానికి ఆర్థిక సాయం బిజెపి యువనేత బిపి నాయక్ కు సంఘం వారు అభినందనలు
Published: Wednesday June 29, 2022
బోనకల్, జూన్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామ చర్చ్ ఆలయ నిర్మాణానికి బీజేపీ యువనేత బిపి నాయక్ అండగా నిలిచి ఆర్థిక సాయాన్ని అందించారు. సోమవారం రాత్రి ఏర్పాటుచేసిన వివిధ సంఘాల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువనేత బీపీ నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలోని అత్యద్భుత చర్చ్ ఆలయాన్ని నిర్మిస్తున్నందుకు కమిటీ వారికి గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని యజ్ఞంగా తీసుకున్న గ్రామస్తుల,మహిళల సంకల్పశక్తిని కొనియాడారు. ఈ స్థలం నుండి సమాజానికి మంచిని, సత్ప్రవర్తనను నేర్పాలని సూచించారు. అనంతరం ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, యువ మోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరశురామ్ లు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి నిధులు సరిపోక ఆపదలో ఉన్న సంఘం వారు తమని సంప్రదించగా యువనేత బీపీ నాయక్ దృష్టికి తీసుకువెళ్లామని, యువనేత హామీ ఇచ్చిన అతికొద్ది రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆళ్ళపాడు గ్రామస్తులు సంఘం వారు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మరీదు పరశురాముడు,మంద రాజ్యం, వెంకట్రావ్, సురేష్, లక్ష్మయ్య, మొండితోక ఆదాం, సైదులు, పెద్ద కిట్టయ్య, ఆదామ్ వేల్పుల, గద్దల బూసి, జీవరత్నం, లక్ష్మణ్, రమేష్ వేల్పుల, దేవమణి సాంబ గ్రామస్తులు, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: