24 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు

Published: Tuesday May 31, 2022

డా. ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల, మే 29 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణం పావని కంటి ఆసుపత్రి  లో అపి, రోటరీ క్లబ్ సహకారం తో  జిల్లా కి చెందిన 24 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు, కంటి అద్దాలు  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో ఆపి రోటరీ క్లబ్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, కొత్త ప్రతాప్, జిల్లా ఆర్టీఏ మెంబర్ సుధాకర్ రావు, జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, కౌన్సిలర్ లు క్యాదాసు నవీన్, కోరే గంగమల్లు,
వైస్ ఎంపీపీ సురేందర్, సర్పంచ్ లక్ష్మణ్ రావు, నాయకులు భోగ ప్రవీణ్, హరీష్, రాము, డా.విజయ్, డా.స్వప్న, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.