పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి

Published: Friday September 03, 2021
ధారూర్ మండల పరధిలో టిఆర్ఎస్ పార్టీ జెండా వేడుకలు
ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజాపాలన : పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర అభినందనీయంగా ఉండాలని ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ధారూర్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర అధినాయకత్వం సిఎం కేసీఆర్, పురపాలక ఐటి శాఖ మంత్రి, రాష్ట్ర టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల పిలుపు మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదేశంతో టిఆర్ఎస్ పార్టీ జెండా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ కమిటీలను ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వం చేసుకుని గ్రామ కమిటీల ఎంపిక చేయాలని సూచించారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీరు 24 గంటల ఉచిత కరెంటు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్యాంకర్ వైకుంఠధామం పల్లె ప్రకృతి వనం కెసిఆర్ కిట్టు గురుకుల పాఠశాలల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనమందరం అండగా ఉండాలని వివరించారు. రుద్రారం గట్టుపల్లి రాంపూర్ గ్రామాలలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పార్టీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.