కరోనా నిర్ములనకు హైడ్రో క్లోరినేషన్ పిచికారీ : సర్పంచ్ అశోక్ రెడ్డి

Published: Friday April 30, 2021
పరిగి, 29 ఏప్రిల్ ప్రజాపాలన ప్రతినిధి : రోజు రోజుకి కరోనా పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమంతగా ఉండాలని మాస్కు ధరించి భౌతిక దూరని పాటించాలని స్థానిక సర్పంచ్ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు. దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా నిర్ములించుటకు సర్పంచ్ అశోక్ రెడ్డి గురువారం గ్రామంలోని అన్ని వార్డులో హైడ్రో క్లోరినేషన్ పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ  సిబ్బంది పాల్గొన్నారు.