ఫైల్ 1. ఫోటో రైటప్ :22 ఏన్కూరు..విద్యార్థులతో భోజనం చేస్తున్న విజయ బాయ్ . గిరిజన వసతిగృహాన్ని సం

Published: Thursday June 23, 2022
ఏన్కూరు జూన్22, (ప్రజా పాలన ):
 మండల పరిధిలోని ఎర్రబొడు తండా లో ఉన్న గిరిజన వసతిగృహాన్ని బుధవారం సిపిఐ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయబాయ్ సందర్శించారు.ముందుగా హాస్టల్ వార్డెన్ తో మాట్లాడారు .పిల్లలు ఎంతమంది వస్తున్నారని, అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.... మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి అని అడిగి తెలుసుకున్నారు. తిమ్మారావుపేట లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి వసతి గృహానికి సుమారు కిలోమీటరు ఉండటంతో నడిచి రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నామని వారి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...పాఠశాలలు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూడాలన్నారు.మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.