తప్పులు చేసే ఆస్కారం రావద్దు

Published: Saturday March 04, 2023
* మున్సిపాలిటీలలో సోమవారం ప్రజావాణి
* మే 31 లోపు సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డుల  పనులను పూర్తి చేయాలి  
* అటెండెన్స్ యాప్ తప్పనిసరి :  జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 03 మార్చి ప్రజాపాలన :  తప్పులు చేసే ఆస్కారం రాకుండా,    తల దించుకునేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పట్టణ ప్రగతి, పారిశుధ్యం, విద్యుత్తు,  త్రాగునీరు, అటెండెన్స్ యాప్ లపై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ మునిసిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజల యొక్క అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలని అన్నారు. సిబ్బందిలో స్పష్టమైన మాకు రావాలని ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.  శానిటేషన్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా మున్సిపల్ సిబ్బందితో పనులు చేయించాలని, పనిచేయని వారిని తొలగించడం జరుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.  పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రోడ్లకు ఇరువైపులా పిచ్చి పిచ్చి మొక్కలు లేకుండా తొలగించదు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారం లో పెట్టిన మొక్కలకు పాదులు తీసి  ఎప్పటికప్పుడు నీరు పోయాలని తెలిపారు. మున్సిపాలిటీలో త్రాగునీరు,  విద్యుత్తు, పారిశుధ్యం పనులను  మార్చి 20 లోపు పక్కగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ సూచించారు. 
* ప్రతి సోమవారం మున్సిపాలిటీలలో ప్రజావాణి :
మున్సిపాలిటీలలో సోమవారం ప్రజావాణిని నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా వినాలని, తమ పరిధిలో పని జరగకుంటే ఎక్కడ జరుగుతుందో సూచించాలని కలెక్టర్ తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని సూచించారు. ప్రజావాణిలో తప్పనిసరిగా  మునిసిపల్ కమిషనర్లు ఉదయం 10:30 నుండి 2 గంటల వరకు ఉండి ఫిర్యాదులను స్వీకరించాలని,  వాస్తవికంగా ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.
మే 31 లోపు సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డుల  పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.
అటెండెన్స్ యాప్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కార్యాలయ సిబ్బందిలో స్పష్టమైన మార్పు రావాలనే ఉద్దేశంతో యాప్ ను తీసుకురావడం జరిగిందని తెలిపారు. కార్యాలయ సమయాల్లో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు,  శానిటేషన్ ఇన్స్పెక్టర్లు , తదితరులు పాల్గొన్నారు