జెడి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published: Friday September 16, 2022
బోనకల్, సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని తోటికుంట్ల గ్రామంలో చైతన్య విద్యాలయం నందు గురువారం జెడి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ ప్రదీప్ , ఏఎన్ఎం నవనీదం, అన్నపూర్ణ దాస్, పాఠశాల కరస్పాండెంట్ ఎస్.కె హుస్సేన్ హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో విద్యార్థిని విద్యార్థులకు ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ వేయడం జరిగింది. డాక్టర్ ప్రదీప్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరం నిర్వహించిన జెడి ఆర్గనైజేషన్ చైర్మన్ అన్నపూర్ణ దాస్ ను పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ ప్రేమ్ కుమార్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, జెడి ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు.