జాతీయ స్థాయి కవిత పోటీ విజేతలు

Published: Saturday October 02, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మనుమసిద్ధి కవితా పోటి విజేతలు మనుమ సిద్ది కవన వేదిక జాతీయ అధ్యక్షుడు దుప్పటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి నల్లురమేష్, కార్యదర్శి జగన్నాధం రాంమోహన్ ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా సత్యాన్వేషి అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించిన కవిత పోటీలో నేడు ఫలితాలను ప్రకటించడం జరిగిందని మనుమసిద్ది కవన వేదిక రాష్ట్ర ప్రచారకార్యదర్శి, కవి, నాశబోయిన నరసింహ(నాన) అన్నారు. విజేతలుగా ఎంపికైన కవులు: 1.కిలపర్తి దాలినాయడు - విజయనగరం, 2.కోరాడ అప్పలరాజు - వైజాగ్, 3.అన్నం శివకృష్ణ ప్రసాద్ - నెల్లూరు,  4.కాదంబరి శ్రీనివాసరావు - వైజాగ్, 5.అయిత అనిత - జగిత్యాల,6.యర్రాబత్తిన మునీంద్ర నెల్లూరు,7. దేవనపల్లి ఓగన్న - మహారాష్ట్ర, 8.అమృతవల్లి అవధానం - ప్రొద్దుటూరు, 9.నెల్లుట్ల లావణ్య - వరంగల్, 10.బత్తిన గీతాకుమారి - ఖమ్మం. విజేతలకు రేపు జ్ఞాపికలు అందించడం జరుగుతుందని, మరియు పాల్గొన్న కవులందరికీ మనుమసిద్ది కవన వేదిక జాతీయ కార్యవర్గం హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.