మహాత్మా గాంధీ వర్ధంతి ఘన నివాళులు

Published: Monday January 31, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 30) మాదాపూర్ లో గల స్వాతి హై స్కూల్ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించిన తాడిబోయిన రామస్వామి యాదవ్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చెయ్యటానికై, దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులలో మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ఒకరని అన్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఫణి కుమార్, సభ్యులు విష్ణు ప్రసాద్, పాలం శ్రీను, ప్రవీణ్, బాలాజీ, శ్రీమతి హేమలత, రవి, భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు