డెంగీ వ్యాదిపై అవగాహన కలిగి ఉండాలిసర్పంచ్ శ్రీమతి కోట విజయశాంతి వెంకట కృష్ణ

Published: Wednesday May 18, 2022
మధిర మే 17 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడు  పిహెచ్సి దెందుకూరు వైద్య అధికారుల ఆధ్వర్యంలో దెందుకూరు గ్రామంలో ముస్లిం బజర్ లో ఇంటింటికి తిరుగుతూ  డెంగీ నివారణ గురించి ప్రజలకు సంపూర్ణ అవగాహన చేసినారు. ఈ కార్యక్రమంనకు సర్పంచ్ శ్రీ మతి కోట విజయ శాంతి  వెంకట కృష్ణా హాజరై పారా మెడికల్ బృందం లో పాల్గొని ప్రతి ఒక్కరు డెంగీ
వ్యాది సంపూర్ణ అవగాహన కల్గి ఉండాలి అని వివరించారు. ఈ కార్యక్రమం లో పిహెచ్ఎన్ రమాదేవి ఎఎన్ఎమ్ రాజేశ్వరి ఆశ కార్యకర్తలు బేగం  విజయ కుమారి జిపి సిబ్బంది పాల్గొన్నారు.