వీఆర్ఏలకు మద్దతు తెలిపిన కూచిపూడి వెంకటేశ్వరరావు..

Published: Thursday August 04, 2022
తల్లాడ, ఆగస్టు 3 (ప్రజాపాలన న్యూస్):
 *గత కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు తల్లాడ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వారి ధర్నాకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలు ప్రభుత్వంలో అనేక రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నారని, తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారికి అండగా ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రావూరి రాంప్రసాద్, వడ్డెళ్ళ నాగేశ్వరరావు, శీలం సత్యనారాయణ రెడ్డి, మొక్కా కృష్ణార్జున్, శీలం నరసింహారెడ్డి, ఎండి బాబు, నారపోగు ప్రసాద్, రాయప్ప, తదితరులు ఉన్నారు.*
 
 
 
Attachments area