కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలి : కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు

Published: Thursday May 06, 2021
మేడిపల్లి, మే5 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ను నియంత్రించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు తెలిపారు. డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్  హెల్త్ అండ్ సానిటేషన్ డిపార్ట్మెంట్ ఇబ్బందికి మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అధికారి సుదర్శన్, ఏఈ విగ్నేశ్వరి, బిజెపి నాయకులు డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట రావు, ప్రధాన కార్యదర్శి సంకురీ కుమార స్వామి, రేవు నర్సింహా, తాళ్ల బాల కృష్ణ, దయానంద రెడ్డి, వాణి పాల్గొన్నారు.