నిరుపేద దంపతులకు ఆర్థిక సహాయం అందజేసిన శబరిమల అయ్యప్ప సేవా సమాజం
Published: Thursday May 20, 2021
పటాన్ చేరు, మే19, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్ చేరు పట్టణంలోని రాజు గురుస్వామి ఇంట్లో అద్దెకు ఉన్న నారాయణ దంపతులకు కరోనా చికిత్స నిమిత్తమై మంగళవారం పటాన్ చేరు శబరిమల అయ్యప్ప సేవా సమాజం ద్వారా రూ. 20 వేలు చెక్కును పటన్ చేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థికసహాయం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు (కాజు గురుస్వామి) మాట్లాడుతూ ప్రస్తుత కరోన విపత్కర సమయంలో తమకు తోచిన విధంగా సహాయం అందజేశామని పేర్కొన్నారు. నిరుపేదలకు అయ్యప్ప సేవా సమితి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాస్ అధ్యక్షులు బల్వంత్ గురు స్వామి, జనరల్ సెక్రెటరీ కాజుపల్లి నవీన్ ముదిరాజ్ గురు స్వామి, ట్రెజరర్ నామ నరసింహులు (రాజు)గురు స్వామి, సెక్రటరీ శ్రీనివాస్ చారి గురు స్వామి, ఆర్గనైజేషన్ సెక్రటరీ నరసింహ చారి స్వామి పాల్గొన్నారు.
Share this on your social network: