లచ్చాకు నివాళులర్పించిన సైదులునాయక్..

Published: Friday November 18, 2022
కారేపల్లి, నవంబర్ 16 (ప్రజాపాలన న్యూస్):
వైరా నియోజకవర్గ పరిధిలోని 
కారేపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బాధావత్ లచ్చ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. గురువారం ఆయన దశదినకర్మ ఆ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ లంబాడ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు బాధావత్ సైదులు నాయక్ ఆసరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుగులోతు మాతృనాయక్, ధరావత్ మాన్సింగ్ నాయక్, జర్పల ప్రసాద్ నాయక్, ఆంగోత్ రవి, గుగులోత్ రమేష్, జాటోత్ ప్రేమ్ కుమార్ నాయక్ ఉన్నారు.