సుధీర్ ఆకస్మిక మృతి బాధాకరం.. నాయకులు బాదావత్ సైదులు నాయక్..

Published: Saturday November 26, 2022
వైరా, నవంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
 ఖమ్మంలోని ఖానాపురంకు చెందిన అన్నబత్తుల సుధీర్  ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు, తెలంగాణ లంబాడ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ సైదులు నాయక్ శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేసి ధైర్యంగా ఉండాలని,  అండగా ఉంటామని అభయమిచ్చారు. నివాళులర్పించిన వారిలో సాయి వివేక్, సురేష్, లలిత, శోభ, సలోమి, భాగ్యమ్మ,  ఉన్నారు.