సుధీర్ ఆకస్మిక మృతి బాధాకరం.. నాయకులు బాదావత్ సైదులు నాయక్..
Published: Saturday November 26, 2022
వైరా, నవంబర్ 25 (ప్రజాపాలన న్యూస్):
ఖమ్మంలోని ఖానాపురంకు చెందిన అన్నబత్తుల సుధీర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు, తెలంగాణ లంబాడ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ సైదులు నాయక్ శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేసి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని అభయమిచ్చారు. నివాళులర్పించిన వారిలో సాయి వివేక్, సురేష్, లలిత, శోభ, సలోమి, భాగ్యమ్మ, ఉన్నారు.
Share this on your social network: