మునుగోడు ప్రచారంలో బెల్లంపల్లి తెరాస ప్రజా ప్రతినిధులు

Published: Wednesday October 19, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి:  మునుగోడు ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణానికి చెందిన తెరాస ప్రజాప్రతినిదులు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మున్సిపల్  చైర్మన్ నూనేటి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి రేవెళ్లి విజయ్, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, చిట్యాల మధు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు దామెర కిరణ్, తదితరులు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో మంగళవారం ప్రచారానికి తరలి వెళ్లారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజక వర్గంలోని గట్టుపల్లి మండల్, తేరేటిపల్లి గ్రామంలోని, ఒకటి, రెండు, వార్డుల్లో తాము ప్రచారం నిర్వహించామని, ప్రచార సరళి, ప్రజల రిసీవింగ్  చూస్తే మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుమంచి  గెలుస్తారని వారు దీమా వ్యక్తం చేశారు.