ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *త్వరితగతిగా రోడ్డు పనులు మాజీ సర్పంచ్ పోచ

Published: Saturday December 03, 2022

బండలేమూరు నుండి పోర్లగడ్డరొడ్డు నిర్మాణం పనులు ప్రారంభించరా..? శంకుస్థాపన చేసి 8నెలలు గడిచింది.. టెండర్ కూడా వేశారు...
రోడ్డు రిపేరు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు..
వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలి..
మాజీ సర్పంచ్ పొచమోని కృష్ణ.....
బండలేమూరు నుండి పోర్లగడ్డరొడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి 8 నెలలు గడిచాయి, టెండర్ కూడా వేశారు కాని నేటికి ఆ పనులు ప్రారంభించకపోవడం విచారకరమని బండలేమూరు మాజీ సర్పంచ్ పొచమోని కృష్ణ అన్నారు. బండలేమూరు నుండి పోర్లగడ్డరొడ్డు మరమత్తలకోసం ఏం అర్ అర్ నిధులు రూ. 24 లక్షలు మంజూరు కాగా ఇట్టి రోడ్డు మరమత్తు పనులకు తేది 2022 మార్చి 22 వ తేదీన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి పనులకు టెండర్ కూడా వేశారని అన్నారు. పొర్ల గడ్డ రోడ్డు అధ్వానంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులపాలవుతున్నరు . గతంలో ఈ రోడ్డులో ఆర్టీసీ బస్సులు నడిచి ప్రజలకు రవాణా సౌకర్యం ఉండేదని రోడ్డు వర్షాలకు దెబ్బతిని వర్రెలు, గుంటలు పడి కంకర కొట్టుకుపోయి కనీసం ద్విచక్రవాహనంపై కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. రెండేళ్ల క్రితమే ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. అప్పటినుండి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
రోడ్డు మరమత్తలకోసం నిధులు మంజూరు అయ్యి టెండర్ కూడా వేసినప్పటికీ నేటికీ పనులు ప్రారంభించకపోవడం విచారకరమని అన్నారు. ఇప్పటికైనా పార్లగడ్డ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.