అంబేద్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి - జి.చెన్నయ్య

Published: Thursday November 03, 2022
హైదరాబాద్ 2 సెప్టెంబర్ ప్రజాపాలన: జోగులాంబ గద్వాల జిల్లా దారుర్ మండలం రేవులపల్లి  గ్రామంలో ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని కావాలని కూల గొట్టిన దుండగులను వెంటనే శిక్షించి అంబేద్కర్ విగ్రహాన్ని   పునః ప్రతిష్టించాలని  డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అంబేద్కర్ విగ్రహంను  తాకాలంటే భయపడే విధంగా చట్టాలు తేవాలని కోరారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని  బహిరంగంగా ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత దేశానికి దిశా దశ చూపించిన దేవుడు, ప్రపంచ మేధావి డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన వ్యక్తులను బహిరంగంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షాన మాలమహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను  చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నామన్నారు.