భారీగా తెరాస పార్టీలో చేరికలు

Published: Wednesday November 16, 2022
మేడిపల్లి, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి చిలుకానగర్ డివిజన్ కాంగ్రెస్, బీజేపీ నాయకులు భారీగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీఆర్ఎస్ (బి.ఆర్.ఎస్) పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి సమక్షంలో మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
మారపాక సాయిలు,రామంచర్ల బలరాం,పల్నాటి కిష్టయ్య,జెక్కి నరసింహ, కొండ్ర రాములు,కొంగరి రామచందర్, పొడిచేటి కృష్ణ,పడిగం రామనర్సయ్య మచ్చ ఆరోగ్యం,గంగారం అంజయ్య, బొల్లాపల్లి శ్రీను,కొండ్ర కనకరాజు,నరసింహ మారేపాక నాగయ్య, బీజేపీ యువజన నాయకులు ఫొటోలు రాజులు మరియు వారి మిత్రబృందం యాభై మందికి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు 
పల్లె నర్సింగరావు,తెరాస సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి,కొంపల్లి రవీందర్ ముదిరాజ్,శనిగరం తిరుమలేష్,వేముల పరమేష్,కొంపల్లి రాజకుమార్, డివిజన్ యూత్ అధ్యక్షులు సీత రాజు యాదవ్,నిల విజయ్,యేసరిని నరేష్ తదితరులు పాల్గొన్నారు.