ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదువందల గుట్కాను పట్టివేత*: టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్

Published: Saturday July 02, 2022
మధిర రూరల్ జూలై1 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారంం నాడు
 రాయపట్నం శివారులో కంచికచర్ల నుంచి వైరాకు కారులో తరలిస్తున్న 1,24,500 విలువగల గుట్కాను పట్టుకోవడం జరిగింది. వైరా కు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి కంచికచర్ల లోని శేఖర్ అనే వ్యక్తి దగ్గరనుండి ఇట్టి గుట్కాలు కొనుగోలు చేసి వైరాకు తీసుకు వెళ్తుండగా మాకు అందిన సమాచారం మేరకు రాయపట్టణం వద్ద పట్టుకోని ఇట్టి వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది