ఘనంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో గోదా దేవి కల్యాణ మహోత్సవం
Published: Thursday January 12, 2023
కోరుట్ల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో గోదా దేవి కల్యాణ మహోత్సవం బుదవారం రోజున ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజనర్సయ్య, ఉపసర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కొండ లక్ష్మణ్, వైస్ చైర్మన్ భూమి వినోద్,అర్చకులు కళ్యాణ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: