ఘనంగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో గోదా దేవి కల్యాణ మహోత్సవం

Published: Thursday January 12, 2023

కోరుట్ల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో  శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయంలో గోదా దేవి కల్యాణ మహోత్సవం బుదవారం రోజున ఘనంగా నిర్వహించారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజనర్సయ్య, ఉపసర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కొండ లక్ష్మణ్, వైస్ చైర్మన్ భూమి వినోద్,అర్చకులు కళ్యాణ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.