ఆర్థిక సహాయం

Published: Friday October 29, 2021
యాదాద్రి అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా దళిత నాయకులు తక్కళ్ళ సంజీవ వైద్య ఖర్చుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధితుని కుమార్తె శ్రావణికి ఒక లక్ష 50 వేల రూపాయల చెక్కును తన సొంత నిధుల నుండి అందజేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి, వెల్వర్తి గ్రామ సర్పంచ్ పసల అన్నామేరీ, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ నానమాల ఉప్పలయ్య, వెల్వర్తి గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్కురి రాములు, మాజీ ఎంపీటీసీ గుండు శేఖర్, బూడిద పాపయ్య తదితరులు ఉన్నారు.