నేడు వైరాలో విద్యుత్ వినియోగదారుల సమావేశం
మధిర నవంబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఎలక్ట్రికల్ రెగ్యులరేటరీ కమిషన్ ఏర్పాటు, దినోత్సవం సందర్భంగా వైరా డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని గురువారం ఉదయం 10 గంటలకు వైరా పరుచూరి గార్డెన్స్ వైరా డివిజన్ డిఈ. కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మధిర విద్యుత్ శాఖ ఏడిఈ అనురాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో వినియోగదారులకు విద్యుత్ వినియోగించే క్రమంలో తీసుకోవలసిన భద్రత, జాగ్రత్తలు మరియు విద్యుత్ సంస్థ ద్వారా నిర్దేశిత, నిర్ణీత కాలవ్యవధిలో విద్యుత్ సంబంధిత సేవలు విషయంలో వినియోగదారులు తెలుసుకోవలసిన పౌర సేవ పత్రము తదితర అంశాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వివరించడం జరుగుతుందన్నారు. విద్యుత్ శాఖ వైరా డివిజన్ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మధిర సబ్ డివిజన్ పరిధిలోని మధిర పట్టణ , మధిర రూరల్, ఎర్రుపాలెం, మామునూరు సెక్షన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు హాజరై విజయవంతం చేయవలసిందిగా ఆమె కోరారు
Share this on your social network: